నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు, జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. శనివారం వారు మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. వాటిలో చేరిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపి, స్థానిక సంస్థల్లో కలిసిమెలిసి ఐక్యంగా పనిచేసే కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో కోమటి శాల రాజు, చెన్న రవి, కోమటి శాల నరసింహులు, గర్ష రాజయ్య, గజ్జల మల్లయ్య, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల ఓబీసీసెల్ అధ్యక్షులు బండి ప్రవీణ్, దుంపల బాలరాజు, గజల చిన్నరాజు, కామిల్ల నరేందర్, రేకులపల్లి కిష్టారెడ్డి, తోట లింగం, నాగరాజు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సొంతగూటికి చేరిన నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES