నవతెలంగాణ – కంఠేశ్వర్ : వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోనీ ధర్నా చౌక్ వద్ద అమెరికా అధ్యక్షుని ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా వామ పక్ష పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇరాన్ పై అమెరికా దాడులను ఖండిస్తూ, అమెరికా యుధోన్మాద చర్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి ఓమయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు శివకుమార్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అశాంతి నెలకొల్పడానికి పచ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణన్ని ప్రోత్సహిస్తూ అమెరికా తన యుద్ధ సామాగ్రిని అమ్ముకుంటూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు.
అందులో భాగంగానే ఇరాన్ లోని చమురు నిక్షేపాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇరాన్ అధ్యక్షుని లొంగదీసుకోవాలని అనువాస్త్రాల వంకతో ఇరాన్ పై ప్రత్యక్షంగా దాడులు చేస్తూ మంత్రాలను ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ఇది పూర్తిగా ఒక దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అవుతుందని అన్నారు. దీని ఫలితంగా పేదరికం మరింత పెరుగుతుందని, ప్రపంచంలో నిత్యవసర సరుకుల ధరలు పెరగటానికి అమెరికా చర్యలు దోహదపడుతున్నాయని వారు విమర్శించారు. అనవస్త్రాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న అమెరికా తన వద్ద ఉన్న 180 అను అస్త్రాల గురించి మాట్లాడటం లేదని వారు విమర్శించారు. ప్రపంచంలో శాంతి నెలకులపాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
భారత్ ,పాక్ మధ్య తానే యుద్ధాన్ని నిలుపుదల చేసినట్లు గొప్పలు చెప్పుకున్న అమెరికాకు భారత ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా చర్యలను ప్రభుత్వం ముక్తకంఠంతో ఖండించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్ నగర నాయకులు కటారి రాములు, అనిత మాస్ లైన్ జిల్లా నాయకులు సుధాకర్, వెంకన్న, నరేందర్ , గణేష్ న్యూ డెమోక్రసీ నాయకులు సాయిబాబా, మల్లికార్జున్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.