నవతెలంగాణ – డిచ్ పల్లి: ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చంద్రాన్ పల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై చిరుత పులి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు ఇంచార్జీ ఫారెస్ట్ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం.. ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చంద్రన్ పల్లి అటవీ ప్రాంతంలో బుధవారం వేకువజామున ఒక చిరుత పులి రోడ్డు దాటుతుండగా ఒక గుర్తు తెలియని వాహనం ఢీ కోనడంతో చిరుత పులి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన వివరించారు. సమాచారం వచ్చిన వెంటనే ఘటన స్థలానికి ఫారెస్ట్ సిబ్బందితో చేరుకుని చిరుత పులిని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు.ఆ పులిని వాహనంలో తిర్మన్ పల్లి సెంట్రల్ నర్సరీకి తరలించినట్లు చెప్పారు. మండల పశువైద్యదికారి గంగా ప్రసాద్ సిబ్బందితో నర్సరీ చేరుకుని పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం డి ఎఫ్ ఓ వికాస్ మీనా సందర్శించి మృతి చెందిన చిరుత పులికి పలువురి సమక్షంలో దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని, ఆ సమయంలో ఏలాంటి వాహనం ఢీ కోనడంతో చిరుత పులి మృతి చెందిందో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో చిరుతపులి మృతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES