Wednesday, June 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికులకు అండగా ఉండే సీఐటీయూనే గెలిపించండి

కార్మికులకు అండగా ఉండే సీఐటీయూనే గెలిపించండి

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-ఐడీఏ బొల్లారం

కార్మికులకు అండగా ఉండే సీఐటీయూనే గెలిపించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, పరిశ్రమ కార్మిక సంఘం యూనియన్‌ అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని కాజీపల్లిలోని టీఐడీసీ పరిశ్రమలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల గేట్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. నిత్యం కార్మికులకు అండగా ఉండే సీఐటీయూనే గెలిపించాలని, చుక్క గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పరిశ్రమలో నాలుగు వేతన ఒప్పందాలు చేశామని తెలిపారు. కార్మికుల కోసం అనేక సౌకర్యాలు సాధించిన చరిత్ర సీఐటీయూకే ఉందన్నారు. మరో అగ్రిమెంట్‌తో పాటు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి మల్లేష్‌, జిల్లా నాయకులు కె.రాజయ్య, జనరల్‌ సెక్రెటరీ భాస్కర్‌ రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం, రానే బ్రేక్‌ వేణుగోపాల్‌, మ్యాట్రిక్స్‌ నాయకులు శ్రీనివాస్‌, యూనియన్‌ నాయకులు శేఖర్‌, వెంకటేశ్వర్లు, సత్తయ్య, సుధాకర్‌, జానీ, ప్రభాకర్‌, శ్రీకాంత్‌ రెడ్డి, జగన్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -