- Advertisement -
– యాడారం సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
బిబిపేట మండలంలోని యాడారం గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామపంచాయతీ వద్ద నిర్వహించిన వేడుకలకు అతిథిగా గ్రామ సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని గ్రామస్తులు సూచించారు. యాడారం పాఠశాల వద్ద జరిగిన గణతంత్ర వేడుకలలో సర్పంచ్ సుధారాణిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొబ్బూరి బాపురెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్, ఆశ, అంగన్వాడి, గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



