Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాయక్ వాడి నర్సయ్య పోరాట స్పూర్తితో బలమైన  ఉద్యమాలను నిర్మిద్దాం..

నాయక్ వాడి నర్సయ్య పోరాట స్పూర్తితో బలమైన  ఉద్యమాలను నిర్మిద్దాం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
రైతాంగ పోరాటయోధుడు అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు అమరుడు కామ్రేడ్ నాయక్వడి నర్సయ్య పోరాట స్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలను నిర్మిద్దామని సీపీఐ(ఎంఎల్) న్యూడేమోక్రసి మండల కార్యదర్శి జె పి గంగాధర్ అన్నారు. శనివారం న్యూడేమోక్రసి డిచ్ పల్లి  మండల కమిటీ ఆధ్వర్యంలో మెంట్రాజ్ పల్లి గ్రామంలో కామ్రేడ్ నర్సయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం జె పి గంగాధర్ మాట్లాడుతూ అర్సపల్లి నివాసి కామ్రేడ్ నాయక్ వాడి నరసయ్య అనేక రైతాంగ ఉద్యమాలు నడిపాడని, పార్టీ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారని, నిజాంసాగర్ ఆయకట్టు రక్షణకై జరిగిన రైతు ఉద్యమం,ఎన్ సి ఎస్ ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ నీ తేరిపించాలని జరిగిన ఉద్యమలో, పంటలకు గిట్టుబాటు ధర రావాలని, విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ఇలా మొత్తం జిల్లా రైతాంగ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ముందు వరుసలో ఉన్నారన్నారు. అంతిమంగా దేశంలో రైతు కూలీ రాజ్యం రావాలని తపించి పోరాడిన గొప్ప రైతు నాయకుడని అన్నారు. అలాంటి ప్రజల మనిషి మన మధ్యన నుండి 3-06- 2025న అనారోగ్యంతో మరణించడం రైతు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను చేపడుతున్నాయని విమర్శించారు. దేశంలోని వనరులు బడా పెట్టుబడిదారులకు సామ్రాజ్య వాదులకు కట్టబెడుతున్నారని, ఆ వెలుగులోనే వ్యవసాయ రంగంలో వచ్చిన మూడు నల్ల చట్టాలన్నారు. వ్యవసాయ రంగంలో రైతుల పెట్టుబడులు పెరుగుతుంటే రైతు పంటలకు మాత్రం గిట్టుబాటు ధర రావడంలేదని కనీసం ఎంఎస్ పి మద్దతు ధరల చట్టాన్ని పాలకులు చేయలేకపోతున్నారని విమర్శించారు .ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బలమైన రైతాంగ ఉద్యమాలు నడపడమే కామ్రేడ్ నరసన్నకు అర్పించే ఘననివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, పిఒడ్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుప్రియ, ఎన్ లక్ష్మి, వై శాంత, మేకల రాజమణి, ఎన్ పాండు, వై లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -