Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిగటిద్దాం

మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిగటిద్దాం

- Advertisement -

4 లేబర్ కోడ్ ల అమలుకు వ్యతిరేకంగా పోరాడుదాం
జులై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం
సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని, నాలుగు లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా పోరాడుదాం అని , జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్ ల రద్దును కోరుతూ జులై 9 న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికవర్గం పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కార్మికులకు పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4లేబర్ కోడ్ లను తీసుకొస్తున్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయి. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంబంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికొద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుంది. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కావున కార్మిక ఐక్య పోరాటలను ఉదృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన జూలై 9 న దేశ వ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతీ కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, స్వర్ణ,మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -