Sunday, June 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మన ఊరి విద్యార్థులను బడిలో చేర్పిద్దాం..

మన ఊరి విద్యార్థులను బడిలో చేర్పిద్దాం..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
మనవూరి పిల్లలను మన ఊరి ప్రభుత్వ బడిలోనే చేర్పిద్దాం అనే నినాదంతో మండలంలోని వెల్మ గూడెంలో ఎంఈఓ తరి రాము, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నెం వెంకిటేశ్వరు శనివారం ఇంటింటికి వెళ్లి ప్రొఫెసర్ జయశంకర్ బడి బాటలో భాగంగా ఈడు పిల్లలు ఎంతమంది ఉన్నారు. ప్రయివేట్ పాఠశాలలకు ఎంతమంది వెళ్తున్నారు అనే వివరాలను సేకరించి ప్రయివేట్ స్కూల్ కి వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మన్నెం వెంకటేశ్వర్లు,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు బాషిపాక లక్ష్మీ సురేందర్, పాఠశాల ఉపాధ్యాయులు ఉప్పునూతల వెంకయ్య, నామిరెడ్డి ప్రశాంతి, ఎండి రహీం గ్రామస్తులు తదితరులు పాల్గొని రెండవ రోజు బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -