Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. 

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. 

- Advertisement -

చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ సూర్య ధనుంజయ్
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
: పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని, ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనుయియ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్నవాన్ని పురస్కరించుకుని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో పంజాబ్ నేష సల్ బ్యాంక్ సహకారంతో ప్రకృతి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వ హించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ లోక పాదని, విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సిలర్ నూర్య ధనుంజయ్ మాట్లాడుతూ ..మహిళా విశ్వవిద్యాలయాన్ని పచ్చని చెట్లతో అందంగా తీర్చిదిదంతో పాటు, పర్యావరణం, పరిరక్షణ, దాని ప్రాముఖ్యత పట్ల విద్యార్థినులకు అవగాహన కల్పించి, కాలుష్యాన్ని పారద్రోలాలని అన్నారు. జీవ జీవవైవిద్యాన్ని కాపాడేందుకు మొక్కలు నాటే కార్యక్రమం చేప ట్టినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థిని తమ తమ స్వగ్రామాల్లో నాలుగు మొక్కలు నాటి భవిష్యత్లో కాలుష్య కారకాలతో పొంచి ఉన్న ముప్పును తగ్గించేందుకు తమవంతు కృషి చేయాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి క్లబ్ ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్  డాక్టర్ ఎస్ సాయి భవాని, అధ్యక్షురాలు నూదియా. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కృష్ణా జీ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -