Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్చెట్టు కొమ్మ విరిగిపడి లైన్ మన్ మృతి

చెట్టు కొమ్మ విరిగిపడి లైన్ మన్ మృతి

- Advertisement -

నాలుగో టౌన్ పరిధిలో ఘటన
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: నగరంలోని వినాయక్ నగర్ లోని ఫూలాంగ్ ప్రాంతంలో చెట్టు కొమ్మ విరిగిపడి విద్యుత్ శాఖ లైన్ మన్ మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నగరంలోని బోర్గాం ( పి )ప్రాంతం సంజీవరెడ్డి నగర్ కు చెందిన శ్రీనివాస్ విద్యుత్ శాఖలో లైన్ మన్ గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో శ్రీనివాస్ స్థానికంగా ఉన్న ఒక షెడ్డు వద్ద ఆశ్రయం తీసుకోగా అక్కడ ఉన్న చెట్టు నుంచి కొమ్మ విరిగిపడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు అని నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తావన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad