- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
లయన్ సహారా ఆధ్వర్యంలో లయన్ పితామహుడు మెల్విన్ జోన్స్ 146వ జయంతి సందర్భంగా నగరంలోని బాపూజీ వచనాలయంలోని నిరుద్యోగ యువతి యువకులకు పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ద్వారకా నగర్ లో గల స్లం ఏరియాలోని నిరుపేద ప్రజలకు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ భక్తవత్సలం, ట్రెజరర్ గంగాధర్, లక్పతి రెడ్డి , లయన్ రీజియన్ చైర్మన్ ఉదయ సూర్య భగవాన్,లయన్ ధనుంజయ రెడ్డి,లయన్ దాసరి వివేక్, లయన్ చందన్ కుమార్, లయన్ బాలకృష్ణ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాలు చేయడంలో లయన్ ఇంటర్నేషనల్ ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటుందన్నారు.
- Advertisement -



