నవతెలంగాణ – కట్టంగూర్
గ్రామీణ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. కొండల్ రెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ కంటి ఆస్పత్రి సహకారం తో మండలంలోని ఈదులూరు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంను సీఐ కొండల్ రెడ్డి సూర్యాపేట కంటి ఆసుపత్రి ఛైర్మెన్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఐ కొండల్ రెడ్డి మాట్లాడారు.అన్ని వర్గాల ప్రజకలకు సేవలు అందిచడంలో లయన్స్ క్లబ్ లు ముందండం అభినందనీయమన్నారు.
మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో లో ఎంతో మంది పేద వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధ పడుతున్నావారు క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కంటి వైద్య శిబిరం లో పాల్గొని చికిత్సలు చేయించుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరం లో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 25 మందికి ఆపరేషన్ చేయడానికి గుర్తించి సూర్యాపేట ఆస్పత్రి తీసుకువెళ్లారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జి ఎం టి కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వరరావు, పటేల్ నరసింహారెడ్డి, జోన్ చైర్మన్ బుడిగ శ్రీనివాసులు, డిసీ మెంబర్ డెంకల సత్యనారాయణ, ఎర్ర శంబులింగారెడ్డి, క్లబ్ అధ్యక్షులు చిక్కు శేఖర్,కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరు వెంకటేశ్వర్లు,సహాయ కార్యదర్శి బసవోజు వినోద్,సభ్యులు తవిడబోయిన నరసింహ, జిల్లా ఉపేందర్, కక్కిరేని నవీన్, రాపోల్ వెంకటేశ్వర్లు, ఆకవరం బ్రహ్మచారి,నకిరేకంటి శంకర్, పున్న సుందర్, చెరుకు శ్రీనివాస్,కంటి హాస్పిటల్ విజన్ టెక్నీషియన్ బంగారు స్వాతి, క్యాంప్ ఇంచార్జి బాణాల వీరేంద్ర చారి గ్రామస్థులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి: సీఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES