- Advertisement -
నవతెలంగాణ – మోపాల్ : మోపాల్ మండల్ న్యాల్కల్ సెక్టర్ పరిధిలో గల కులాస్పూర్ అంగన్వాడి కేంద్రం కొత్తగా చేరిన పిల్లలకి అక్షరాభ్యాసం, అన్నప్రసాద కార్యక్రమo చేపట్టడం జరిగింది. అలాగే రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశానుసారం గుడ్డు బిర్యానీ కూడా అందజేయడం జరుగుతుందని సూపర్వైజర్ జాకీర, అంగన్వాడి టీచర్ రజిత తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని తల్లిదండ్రులు వృధా చేయకుండా ప్రయివేటు పాఠశాలకు పంపకుండా తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలకే పిల్లల్ని పంపించాలని, వారికి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని వారు తెలిపారు.
- Advertisement -