- Advertisement -
నవతెలంగాణ – బజార్ హత్నూర్
రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించాలని మండల పశు వైద్యాధికారి పార్విద్ హైమద్ అన్నారు. మంగళవారం మండలంలోని వార్త మన్నూర్, బుర్కపల్లి గ్రామాల్లో పశువులకు గలికుంటు వ్యాధి నివారణ టీకాలు పశువులకు వేసి గాలి కుంటు వ్యాధి నివారణా టీకాలు పంపిణీ చేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువుల యజమానులు గోజాతి, గేదేజాతి పశువులకు తప్పకుండా టీకాలు వేయించాలని, టీకాల పంపిణీ శిబిరాలు అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



