- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని అన్ని గ్రామాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇప్పించాలని మండల వైద్యాధికారి ఆశ్రిత తెలిపారు. మండలంలోని గన్యా తండా, నూర్ సింగ్ తండా లొ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 228 గేదెలకు 64 ఆవులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా ఇవ్వడం జరిగిందని పశువైద్యాధికారి అశ్రిత తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది గోపాలమిత్రాలు రైతులు పాల్గొన్నారు.
- Advertisement -