నవతెలంగాణ – తుంగతుర్తి
జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి,పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్లడం జరుగుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. ఈ మేరకు బుధవారం తుంగతుర్తి ప్రాంతీయ పశువైద్యశాల యందు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం గురించి మండలాల వారిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిధిలోని నియోజకవర్గంలో 34300 పశువులకు గాను,14 వైద్య బృందాల ఆధ్వర్యంలో 24250 పశువులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. మిగతా పశువులకు ఈనెల 14 వరకు టీకాల కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పశు వైద్యశాల తమకు కేటాయించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో సహాయ సంచాలకులు డాక్టర్ వెంకన్న,డాక్టర్ రవి ప్రసాద్ గౌడ్,నియోజకవర్గం డాక్టర్లు డాక్టర్ నరేష్,డాక్టర్ రవి,డాక్టర్ రవికుమార్,డాక్టర్ అర్జున్,డాక్టర్ నవీన్,జేవివో నాగరాజు,ఎల్ ఎస్ ఏ లు మురళి,స్వప్న,రాజశేఖర్,విఏలు పద్మ,రవి సిబ్బంది బుచ్చిబాబు,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



