నవతెలంగాణ-భిక్కనూర్
లోకల్ వాహనదారులు టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లించకుండా వెళ్లడానికి ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందని టోల్ ప్లాజా యాజమాన్యం తెలియజేసినట్లు సిఐ సంపత్ కుమార్ తెలిపారు. గత కొంతకాలంగా లోకల్ వాహనదారులకు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ నుండి డబ్బులు కట్ అవుతున్నందున మండల లోకల్ వాహనదారులు టోల్ ప్లాజా యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. గురువారం మండల వాహనదారులు, టోల్ ప్లాజా యాజమాన్యం, పోలీసుల ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాహనదారులు టోల్ ప్లాజా యాజమాన్యంతో చర్చలు జరిపి లోకల్ వాహనదారులకు మినహాయింపు ఇవ్వడానికి అంగీకరించారు. లోకల్ వాహనదారులు ఆధార్ కార్డు, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు టోల్ ప్లాజా యాజమాన్యానికి అందజేస్తే లోకల్ వాహనాలకు మినహాయింపు ఇస్తామన్నారు. అనంతరం సిఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఏదైనా సమస్య ఏర్పడితే రోడ్లపై వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయవద్దని శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. అకారణంగా శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు, టోల్ ప్లాజా మేనేజర్ ప్రకాష్, లోకల్ వాహనదారులు, తదితరులు ఉన్నారు.
లోకల్ వాహనాలు ఆధార్ చూపిస్తే సరిపోతుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES