Tuesday, July 1, 2025
E-PAPER
Homeజాతీయంత‌క్ష‌ణ‌మే లోక్‌స‌భ‌ డిప్యూటీ స్పీక‌ర్‌ను ఎన్నుకోవాలి.. ఖ‌ర్గే మోడీకి లేఖ

త‌క్ష‌ణ‌మే లోక్‌స‌భ‌ డిప్యూటీ స్పీక‌ర్‌ను ఎన్నుకోవాలి.. ఖ‌ర్గే మోడీకి లేఖ

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ: లోక్‌స‌భ‌కు డిప్యూటీ స్పీక‌ర్‌ను ఎన్నుకోవాల‌ని, ఆ ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే డిమండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇవాళ ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు. ఎటువంటి జాప్యం చేయ‌కుండా ఆ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతంగా పూర్తి చేయాల‌న్నారు. 16వ లోక్‌స‌భ ప్రారంభం అయ్యే వ‌ర‌కు ప్ర‌తి స‌భ‌లోనూ డిప్యూటీ స్పీక‌ర్ ఉన్నార‌ని, ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి డిప్యూటీ స్పీక‌ర్‌ను ఎన్నుకోవ‌డం ఆన‌వాయితీ అని ఆయ‌న ఆ లేఖ‌లో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -