Monday, December 29, 2025
E-PAPER
Homeక్రైమ్కారును ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

కారును ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం అంజనాపురం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన లారీ అంజనాపురం గ్రామ సమీపంలో కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -