తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ – తాడ్వాయి : నూతన సాంకేతిక పరిజ్ఞానం(సిఈఐఆర్)తో పోగొట్టుకున్న ఫోన్లను వెతికి పట్టుకోవడంలో తాడ్వాయి పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మండలంలోని మేడారం గ్రామానికి చెందిన కీసర శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఫోను పోగొట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులను ఆశ్రయించి, ఆయన తమ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన తాడ్వాయి పోలీసులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్ (సీఈఐఆర్) అప్లికేషన్ ఉపయోగించి పోయిన సెల్ఫోను వెతికి పట్టుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి బాధితునికి మంగళవారం పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఫోన్ ను స్వయంగా అందజేశారు. ఫోన్ రికవరీ చేయడంలో బాధ్యతగా వ్యవహరించిన కానిస్టేబుల్ సాంబయ్యను అభినందించారు.
పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES