- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో ఆంద్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
- Advertisement -