Monday, June 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమేడిగడ్డ బ్యారేజీ రిపోర్టుపై ఎల్ అండ్ టీ సంచలన లేఖ

మేడిగడ్డ బ్యారేజీ రిపోర్టుపై ఎల్ అండ్ టీ సంచలన లేఖ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ ఫెయిలైందంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డీఎస్ఏ) ఇచ్చిన నివేదికపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మండిపడింది. బ్యారేజీ నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ పాటించలేదనే ఆరోపణలను తోసిపుచ్చింది. ఎలాంటి సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజ్ ఫెయిలైందని ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. ఈ మేరకు తాజాగా ఎల్ అండ్ టీ ఓ లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్ డీఎస్ఏ ఇచ్చిన నివేదికను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు తేల్చిచెప్పింది. మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డమ్ సేఫ్టీ అథారిటీ కీలక రిపోర్డును ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై తాజాగా ఎల్ అండ్ టీ స్పందిస్తూ లేఖ రాసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -