- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్ : గురువారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన కలెక్టర్ మీటింగ్ లో మద్నూర్ మండలానికి చెందిన పలువురు మహిళా సర్పంచులు పాల్గొన్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సర్పంచులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. గురువారం నాడు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్ లో మద్నూర్ మండలంలోని మహిళా సర్పంచులు ఆవల్గావ్ సర్పంచ్ మాన్య బాయి, పెద్ద తడగూర్ సర్పంచ్ శాంతాబాయి, అంతాపూర్ సర్పంచ్ పార్వతి బాయి వీరితో పాటు మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని ఇతర గ్రామాల మహిళా సర్పంచులు కూడా పాల్గొనడం విశేషం.
- Advertisement -



