నవతెలంగాణ – భిక్కనూర్
మహా శివరాత్రి సందర్భంగా పట్టణ కేంద్రంలోని దక్షిణ కాశి శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలో ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. “ఓం నమః శివాయ” నామస్మరణతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదం, అన్నదాన కార్యక్రమం వంటి సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈఓ శ్రీధర్ తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ కమిటీ, ప్రజా ప్రతినిధులు, పోలీసుల ఆధ్వర్యంలో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో శివునికి పూజలు అర్పించి ఆశీర్వాదాలు పొందారు.



