- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో మహాలక్ష్మి అమ్మవారికి బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం గ్రామ కమిటీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు బోనాలను డప్పువాయిద్యాల మధ్య ప్రదాన విదుల గుండా ఊరేగించారు. అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి ఏటలు బలి ఇచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామపెద్దలు తెలిపారు.
- Advertisement -