నవతెలంగాణ-హైదరాబాద్: 2024లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడానికి ఒక బ్లూప్రింట్ అని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. అదే మాదిరిగా బీహార్ ఎన్నికలు కూడా నిర్వహించడానికి కేంద్రం సిద్ధమైందని మండిపడ్డారు. ఆ రాష్ట్ర ఎన్నికల మాదిరిగా బీహార్ లో కూడా రిగ్గింగ్ చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన ఆయన రాసిన న్యూస్ పేపర్ ఆర్టీకల్ ను పోస్టు చేశారు. అందులో కీలక అంశాలను ఆయన లెవనెత్తారు. ఎన్నికలకు ముందే ఈసీ కమిషన్ లో సభ్యులను మార్చారని, అదే విధంగా సరైన పత్రలను లేని ఓటర్ల జాబితాలను విడుదల చేశారని రాసుకొచ్చారు. అదే విధంగా బీజేపీ పోటీ చేసే ప్రాంతాల్లో అనువ్యహాంగా బోగస్ ఓట్లను సృష్టించారన్నారు. ఆ ఓట్లతో అధికారం చేపట్టిన నేతలు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాసమస్యలను పెడచెవిన పెడుతున్నారని వివరించారు. ఆ తర్వాత ఓటింగ్ శాతంపై కూడా తేడాలొచ్చాయని ఆయన ఆరోపించారు. అదే తరహాలో బీహార్ ఎన్నికలు ఉండనున్నాయని ప్రతిపక్ష నేత రాహుల్ పేర్నొన్నారు.
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని మహాయుతి కూటమి 235 సీట్లతో అఖండ విజయం సాధించింది. ఈ ఫలితాలు 132 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. మహాయుతి కూటమిలో భాగమైన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా వరుసగా 57, 41 సీట్లతో ముందున్నాయి. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కాంగ్రెస్ కేవలం 16 సీట్లను గెలుచుకోవడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దాని కూటమి భాగస్వామి శివసేన (యుబిటి) 20 సీట్లు గెలుచుకోగా, ఎన్సిపి (శరద్ పవార్ వర్గం) కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకుంది.