కథానాయిక రష్మిక మందన్న ప్రధాన పాత్రధారిణిగా, రవీంద్ర పుల్లె డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మైసా’. పవర్ఫుల్ ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమంతో గ్రాండ్గా లాంచ్ అయ్యింది. దీనికి కోర్ టీం హాజరయ్యారు. సురేష్ బాబు క్లాప్ కొట్టారు. రవి కిరణ్ కోలా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్ను మేకర్స్కు అందజేసిన దర్శకుడు హను రాఘవపూడి ముహూర్తపు షాట్కు గౌరవ దర్శకత్వం చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమవుతుంది.
మైసా గోండ్ తెగల బ్యాక్డ్రాప్లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతోంది. రష్మిక మందన్న ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవతార్లో కనిపించనుంది. ఈ చిత్రానికి నిర్మాతలు: అన్ఫార్ములా ఫిల్మ్స్, డీవోపీ: శ్రేయాస్ పి కష్ణ, స్టంట్స్: ఆండీ లాంగ్.
‘మైసా’ షూటింగ్ షురూ..
- Advertisement -
- Advertisement -