- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల రైతు వేదిక లో మంగళవారం రైతులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంపై ఏఈఓ పృథ్విరాజ్ అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా మోతాదుల ఎరువుల వాడకం, భూసార పరీక్షలపై రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తరఫున సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. అనంతరం రైతులకు తాడిచర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి చేతుల మీదుగా క్యాలెండర్, టోపీలు , పెన్స్, బుక్స్, గోనె సంచీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెదతుండ్ల ఏఈఓ శిరీష, సిఆర్పిలు పాల్గొన్నారు.
- Advertisement -



