- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి కాటేదాన్ సమీపంలో ఉన్న ప్లైవుడ్ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు సహాయం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
- Advertisement -



