Saturday, June 28, 2025
E-PAPER
Homeఖమ్మంచలో పూసుగూడెం విజయవంతం చేయండి..

చలో పూసుగూడెం విజయవంతం చేయండి..

- Advertisement -

బీఆర్ఎస్ మహిళా నేత వగ్గెల పూజ
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఈ నెల 30న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన “ఛలో పూసుగూడెం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజక వర్గం మహిళా నేత వగ్గెల పూజ పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాలు మేరకు శనివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఆమె మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు కు అందించాల్సిన సాగు నీటిని పక్క జిల్లాలకు తరలిస్తున్న వైనాన్ని నిరసిస్తూ ఆమె మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క,పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇంచార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ములకలపల్లి మండలం, పూసుగూడెం కు హెలికాప్టర్ లో వచ్చి కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, హంగు ఆర్భాటాల తో ప్రాజెక్టును ప్రారంభించి నప్పటికీ,భద్రాద్రి జిల్లా రైతులకు ఒరిగిందేమీ లేదని, సీతారామ ప్రాజెక్టు నుండి జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అంద లేదనీ ఆమె అన్నారు.

చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే నిదర్శనం అనీ ఎద్దేవ చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడైతే ప్రాజెక్టును ప్రారంభించారో అక్కడే ఈ నెల 30 న ఛలో పూసుగూడెం నిర్వహించి ఉదయం 11 గంటలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండప్రదానం చేయాలని పార్టీ నిర్ణయించిందని, అందుకోసం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మాజీ వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, పార్టీ టౌన్ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, సీనియర్ నాయకులు జుజ్జూరపు శ్రీరామ మూర్తి, ఎంపీటీసీ పూర్వ సభ్యులు  వగ్గెల అనసూర్య, పార్టీ పేరాయిగూడెం గ్రామ ప్రెసిడెంట్ చిప్పనపల్లి బజారయ్య, మాజీ వార్డు సభ్యులు నక్కా రాంబాబు, గంధం సుజాత, షేక్ రహీమూన్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -