సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ఈ నెల 9,10,11 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతును జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం, నమాత్ పల్లి, నందనం, బస్వాపురం, హన్మాపురం గ్రామాలలో సీపీఐ(ఎం) జిల్లా క్లాసులను జయప్రదం కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేపట్టడానికి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం ఈ క్లాసులను నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సాగు, తాగునీరు సమస్యల పరిష్కారం చేయడంలో, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికీ అనేక మార్కెట్ యార్డులలో వరి ధాన్యం కొనుగోలును ఆలస్యం చేస్తున్నారని, కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాలో డబ్బులు సక్రమంగా వేయడం లేదని వెంటనే విడుదల చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈనెల 9,10,11 తేదీలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్లాసులలో గ్రామ, మండల, జిల్లా నాయకత్వం పాల్గొని జయప్రదం చేయాలని అంజయ్య కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, అన్నంపట్ల కృష్ణ, మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, మోటె ఎల్లయ్య, కొండపురం యాదగిరి, మద్దెపురం బాల్ నర్సింహ, బొల్లెపల్లి లీల, అనాజిపురం శాఖ కార్యదర్శులు ఏదునూరి వెంకటేష్, కడారి కృష్ణ, నమాత్ పల్లి శాఖ కార్యదర్శి జిట్టా అంజిరెడ్డి, బస్వాపురం శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్, నందనం శాఖ కార్యదర్శి కొల్లూరి సిద్దిరాజులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES