- Advertisement -
- – జిఎంపిఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు దేవునూరి బాలయ్య, పాక జహంగీర్…
- నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
- జూన్ 4 వ తేదీన భువనగిరిలో నిర్వహించే గొర్రెల మేకల పెంపందర్ల సంఘం 4 మండల సదస్సు జయప్రదం చేయాలని జిఎంపిఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు దేవునూరి బాలయ్య, పాక జహంగీర్ కోరారు. శుక్రవారం మండలంలోని ఎర్రంబెల్లి, నాగిరెడ్డిపల్లి, అనాజిపురం, నమాతుపల్లి గ్రామాలలో మండల సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించి , మాట్లాడారు. గొర్రెల మేకల పెంపందర్ల సంఘం 1995 సంవత్సరంలో ఏర్పాటు అయింది అని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వారసత్వాన్ని పునికి పుచ్చుకొని గొర్రెల కాపరులను ఐక్యం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం సంఘం అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. జి ఎం పి ఎస్ పోరాటాల ఫలితంగానే జీవాలకు ఉచితంగా మందుల పంపిణీ, తుమ్మ మండ, ప్రభుత్వ భూములలో మేత మేపుకోవడానికి జీవో నెంబర్ 1016, 559 జీవోలను తీసుకువచ్చింది అన్నారు. గొర్రెల కాపులకు ఎక్స్పీరియా కోసం 61 జీవోను తీసుకువచ్చిందని, ఎన్ సి డి సి రుణాలను సాధించి కాపర్లకు రుణాలు ఇప్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో గొర్రె కాపరులకు పెన్షన్లు , రుణమాఫీ అమలు, గొర్రెల పంపిణీ పథకం నగదు బదిలీ కోసం పోరాటం చేయనుందని తెలిపారు. పై సమస్యల పరిష్కారం కోసం జూన్ 4వ తేదీన భువనగిరిలో టీఎన్జీవో భ, తాసిల్దార్ కార్యాలయం ముందు నిర్వహించే మండల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈ సదస్సుకు గొల్ల కురుమలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సొసైటీ అధ్యక్షులు గొర్ల స్వామి యాదవ్, జక్కుల సత్తయ్య యాదవ్, కదిరె జంగయ్య యాదవ్, కడారి కృష్ణ, గొర్ల వెంకటేష్, తెల్చూరి మల్లేష్ యాదవ్, కంబాలపల్లి ఆంజనేయులు, భీమ గాని నరేష్, ఎల్లంల వెంకటేష్, శ్రీరామ్ శ్రీశైలం, నాగుల బాల నరసింహ, శ్రీరామ్ బాలరాజు, కడారి ఐలయ్య, శ్రీరామ్ కృష్ణ, శ్రీరామ్ అంజయ్య , ప్రజాసంఘాల నాయకులు ఎదునూరి మల్లేశం లు పాల్గొన్నారు.
- Advertisement -