- Advertisement -
నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్
గురువారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని డిసిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి అన్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొట్టమొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికి సన్మాన సభల కార్యక్రమంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరు పాల్గొని విజయవంతం చేయాలని, ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి మండలంలోని అన్ని గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



