Wednesday, April 1, 2026
E-PAPER
- Advertisement -

సంగారెడ్డిలో మలబార్ గోల్డ్& డైమండ్స్ షోరూమ్‌ ప్రారంభం

నవతెలంగాణ సంగారెడ్డి: మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఈ రోజు తెలంగాణలోని సంగారెడ్డిలో తమ సరికొత్త షోరూమ్‌ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జయప్రకాష్ రెడ్డి, టీఎస్ఐఐసీ లిమిటెడ్ చైర్‌పర్సన్ టి.నిర్మల జగ్గారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులు సిరాజ్ పీకే, హెడ్ – రిటైల్ ఆపరేషన్స్ (రెస్ట్ ఆఫ్ ఇండియా), షానిబ్ కే, జోనల్ హెడ్- తెలంగాణ, ముహమ్మద్ షరీజ్ కే, జోనల్ హెడ్ – హైదరాబాద్, అసిస్టెంట్ షోరూమ్ హెడ్ ఇంజిఫ్ అబ్దిల్లా పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్ ప్రపంచ స్థాయి వాణిజ్య ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన సంగారెడ్డి షోరూమ్, స్పష్టమైన రీతిలో ఉత్పత్తి ప్రదర్శనలు చేయటంతో పాటుగా సులభమైన నావిగేషన్, వ్యక్తిగతీకరించిన సహాయంతో వినియోగదారులకు ఒక క్రమబద్ధమైన, ఆహ్వానించదగిన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ షోరూమ్‌లో సాంప్రదాయ, సమకాలీన అభిరుచులకు అనుగుణంగా బంగారం, వజ్రాలు, ప్లాటినం, విలువైన రత్నాల ఆభరణాల విస్తృత శ్రేణి అందుబాటులో ఉంది. వినియోగదారులు పెళ్లికూతురు కలెక్షన్లు, పండుగ ఆభరణాలు, రోజువారీ డిజైన్లు మరియు సమకాలీన ఆభరణాలతో సహా అనేక రకాల ఉత్పత్తులను పరిశీలించవచ్చు. వజ్రాలు, అన్ కట్ వజ్రాలు, రత్నాలు, చేతితో తయారు చేసిన బంగారు ఆభరణాలు, పోల్కీ ఆభరణాల వంటి సిగ్నేచర్ కలెక్షన్లు, పనితనం, డిజైన్ డిటైలింగ్, మారుతున్న వినియోగదారుల అభిరుచులకు బ్రాండ్ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రదర్శిస్తాయి.

ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహ్మద్ మాట్లాడుతూ,“మలబార్ గోల్డ్ & డైమండ్స్‌కు తెలంగాణ ఒక కీలకమైన మార్కెట్‌గా ఉంది. సంగారెడ్డి షోరూమ్, వినియోగదారులకు క్రమబద్ధమైన, ఆహ్వానించదగిన, ప్రపంచ స్థాయి రిటైల్ అనుభవాన్ని అందిస్తూ, ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మాకు వీలు కల్పిస్తుంది” అని అన్నారు.

షోరూమ్‌కు వచ్చిన సందర్శకులు పారదర్శకమైన ధరలు, ఉత్పత్తుల గురించిన సవివరమైన సమాచారం, HUID ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బంగారం, సర్టిఫైడ్ వజ్రాలు, దేశవ్యాప్తంగా ఏకరూప ధరలను నిర్ధారించే ‘వన్ గోల్డ్ వన్ గోల్డ్ రేట్’ విధానాన్ని ఆస్వాదించవచ్చు. ఈ స్టోర్, శుభ సమయాల్లో వినియోగదారులకు మరింత విలువను అందించే రీతిలో ప్రత్యేకమైన అడ్వాన్స్ బుకింగ్ అవకాశాలను కూడా అందిస్తుంది. పండుగ రద్దీకి ముందే బంగారం కొనుగోళ్లను ఖరారు చేసుకోవడానికి, వినియోగదారులు ప్రత్యేకమైన అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్ల నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఈ పవిత్రమైన కాలంలో ఆభరణాలను అప్‌గ్రేడ్ చేయాలనుకునే లేదా వాటిలో పెట్టుబడి పెట్టాలనుకునే వినియోగదారులకు అధిక విలువను మరియు పారదర్శకతను అందిస్తూ, ఈ బ్రాండ్ 4.9% నుండి ప్రారంభమయ్యే తరుగు ఛార్జీలతో పాటు, పాత బంగారం మార్పిడిపై 0% తగ్గింపును అందిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -