Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeవరంగల్మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా మల్హర్ ఆరుగురికి స్థానం.!

మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా మల్హర్ ఆరుగురికి స్థానం.!

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు.
మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చెసిన విషయం తెలిసిందే.అయితే మల్హర్ మండలం నుంచి ఆరుగురికి స్థానం దక్కింది.మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన పన్నాల ఓదెలు యాదవ్,లింగంపల్లి నర్సింగరావు, ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి దూలం సులోచన,పెద్దతూoడ్ల గ్రామ మాజీ సర్పంచ్ అజ్మీరా చంద్రు నాయక్,వళ్ళెంకుంట గ్రామానికి చెందిన గడ్డం పొచయ్య,అడ్వాలపల్లి గ్రామానికి చెందిన, ప్రస్తుతం కొనసాగుతున్న తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య లను నియమించారు.తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు,నాయకులకు,కార్యకర్తలకు,వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad