నవతెలంగాణ-హైదరాబాద్ : వలసదారులకు రక్షణ కల్పించే ఉత్తర్వుపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ శుక్రవారం సంతకం చేశారు. న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలో మత పెద్దలతో జరిగిన సమావేశంలో మమ్దానీ ఈ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసిఇ) వంటి సమాఖ్య సంస్థలు, గ్యారెజీలు, పాఠశాలలు లేదా ఆసుపత్రులు వంటి ప్రయివేటు ఆస్తులను వారెంట్ లేకుండా యాక్సెస్ చేయలేవని ఈ ఉత్తర్వు పేర్కొంది.
కాగా, ప్రధాన నగర ఏజెన్సీలు.. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో ఎలా వ్యవహరించాలో ఉద్యోగులందరికీ శిక్షణ అందిస్తాయి. ప్రతి విభాగంలో గోప్యతా అధికారిని నియమించడానికి, నిర్దిస్ట శిక్షణా కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి, సమాఖ్య సంస్థలతో.. ముఖ్యంగా ఐసిఇతో డేటా భాగస్వామ్యాన్ని పరిమితం చేయడం ద్వారా రక్షణ చర్యలకు అనుగుణంగా ఉన్నట్లు ధృవీకరించడానికి నగర పరిపాలనకు రెండు వారాల సమయం ఇస్తున్నట్లు ఈ ఉత్తర్వు వెల్లడించింది. ముఖ్యంగా న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్, కరెక్షన్స్ డిపార్ట్మెంట్, పిల్లలు, కుటుంబ సేవల విభాగం, ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో పరస్పర చర్యలకు సంబంధించి వారి అంతర్గత విధానాల ఆడిట్లను నిర్వహించడం, వారి ప్రోటోకాల్లను నవీకరించడం, ఈ విధానాలలో పారదర్శకతను పెంచడం అవసరమని ఈ ఉత్తర్వు పేర్కొంది. వలస రంగంలో సంక్షోభ నిర్వహణను సమన్వయం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఈ ఉత్తర్వు పేర్కొంది. ప్రత్యేకించి పారిస్వాసులకు వారి హక్కుల గురించి తెలియజేయడానికి పది భాషల్లో 32 వేల కరపత్రాలను మమ్దానీ పంపిణీ చేశారు.
వలసదారులకు రక్షణ కల్పించే ఉత్తర్వులు జారీ చేసిన మమ్దానీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



