- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
మద్యం సేవించి వాహనాలు నడిపిన ఒకరికి పది రోజుల జైలు శిక్ష పడిందని 15 మందికి జరిమానా విధించామని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ గురుువారం ట్రాాఫిక్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరుపరచగా 15 మందికి 21,500/- విధించామన్నారు.బోర్గం కు చెందిన చామకూర లక్పతి అను వ్యక్తి తరచుగా ( మూడుసార్లు) మద్యం తాగి దొరకడం వలన పది రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు.
- Advertisement -