- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రానికి చెందిన వేణు తన తండ్రి మరణించిన తర్వాత బంధువుల ఇంటికి వెళ్ళాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనకాల డోర్ పగలగొట్టి దొంగతనం చేయగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం సిద్ధ రామేశ్వర ఆలయ కమాన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాగర్ ని పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు అరెస్టు చేసి రిమాండ్ తరలించి జైలుకు పంపినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
- Advertisement -