Saturday, June 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభూ తగాదాలతో వ్యక్తిపై దాడి 

భూ తగాదాలతో వ్యక్తిపై దాడి 

- Advertisement -

తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలింపు 
నవతెలంగాణ – రామారెడ్డి 
: ఇంటి వద్ద బాత్రూం స్థలం విషయంపై గొడవ జరిగి వ్యక్తిని గాయపరచిన ఘటన మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన ముదాం రాజయ్య, అన్న ముదాం నరసయ్యతో గొడవ జరుగుతుండగా ముదాం శ్రీకాంత్, ముదాం లక్ష్మయ్యలు రాజయ్యపై కట్టెతో కదాడి చేసి గాయపరిచారని రాజయ్య కుమారుడు నరేష్ తెలిపాడని అన్నారు. నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజారాం తెలిపారు. గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -