Monday, June 16, 2025
E-PAPER
Homeక్రైమ్పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ : మద్యానికి బానిసై వివాహితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జుక్కల్ మండలంలోని పెద్ద ఏడిగి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద ఎడిగి గ్రామానికి చెందిన బోయిన వార్ గంగామణి భర్త హనుమంతు (30). భారాభర్తలు. వీరికి ఒక కొడుకు ప్రదీప్(11), ఒక కూతురు సంధ్యారాణి (14), సంతానం ఉన్నారు. హనుమంతు మద్యానికి బానిసై, జులాయిగా తిరుగుతూ పని పాటు లేకుండా ఉండేవాడు. కొన్ని రోజుల క్రితం అత్తగారిల్లు అయిన పెద్ద ఏడిగి గ్రామంలో హనుమంతు మామ వీరికి ఉండడానికి ఒక ఇల్లు, కొంత వ్యవసాయ భూమిని కూతురికి ఇచ్చిరు. ఇక్కడ కూడా మద్యం సేవించడం, జులాయిగా అల్లుడు తిరుగుతున్నాడని, తన దగ్గరే ఉంటే ప్రవర్తనలో మార్పు వస్తుందని అనుకున్నానని,  అతను ఏమీ మరలేదని, దీంతోపాటు పిల్లలను కొట్టడం ప్రారంభించాడు. కొన్ని రోజుల క్రితం భర్తను భార్యకుటింబికులు అల్లుడిని కూర్చొ పెట్టుకొని, ఎందుకు మద్యం తాగుతున్నావని, బాగుండదని నచ్చజెప్పి ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో కొంత వాదోపవాదులు జరిగాయి. మనస్తాపం చెందిన హనుమంతు పడంపల్లి శివారులోని వ్యవసాయ భూమిలో మద్యంతో పాటు గుర్తుతెలియని పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో భార్య జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ ఉండేవాడని, ఆత్మహత్యకు కారణం ఏమీ లేదని, తమకు ఎవరిపై అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.  జుక్కల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -