పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య..

నవతెలంగాణ – జమ్మికుంట
జీవితం పై విరక్తితో పురుగుల మందు సేవించి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. జమ్మికుంట పట్టణ సిఐ ఒరగంటి రవి తెలిపిన వివరాల ప్రకారం పొలసాని కార్తీక్(26)  హైదరాబాదులో టెక్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆదివారం  తిరుపతి కి పోదామని తండ్రి సంపత్ రావు రమ్మంటే నాకు లీవు దొరకదు, నేను రాను మీరు పోయి రండి అని చెప్పాడు. తండ్రి సంపత్ రావు, కూతురు, అల్లుడు అందరూ కలిసి తిరుపతి వెళ్లారు. వారు తిరుపతిలో ఉన్నప్పుడు కార్తీక్ తండ్రి కి ఫోన్ చేసి  50 వేల రూపాయలు కావాలని అడిగాడు. తిరుపతి యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తానని కొడుకు కార్తీక్ తో చెప్పాడు. బుధవారం ఉదయం అందాజా 5:30 పొలసాని సాగర్ రావు ఫోన్ చేసి కార్తీక్ రాత్రి ఏదో పురుగుల మందు తాగి  ఇంటిముందు పచ్చగా కక్కి మంచం మీద చనిపోయి పడి ఉన్నాడు అని తండ్రికి సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చాక  కొడుకు ఫోన్ చెక్ చేయగా, తనకు అప్పులు బాగా ఉన్నందున అప్పు తీర్చలేనని , జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి చనిపోయినాడని తండ్రి  సంపత్ రావు దరఖాస్తు ఇవ్వగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ తెలిపారు.
Spread the love