నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని బ్రహ్మంన్ గాం గ్రామానికి చెందిన పోతన్న( 58) అనే వ్యక్తి మద్యానికి బానిసై చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ తెలిపారు. ఎస్ఐ కధనం ప్రకారం… మృతుడు తన ఇంటి నుంచి ఆదివారం సాయంత్రం వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలించగా ఆచుకి లభించలేదు. సోమవారం ఉదయం స్థానిక చెరువు గట్టు మీద మృతుడు సంబంధించిన వస్తువులు కనిపించడంతో కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. చెరువులో వెతకంగా మృతదేహం దొరకంటంతో బయటకు తీశారు .ఆనంతరం భైంసా ఆస్పత్రికి పోస్టుమార్టం కు తరలించారు. మృతుడు మద్యానికి బానిసై యి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడు కి బార్య , ఇద్దరు కుమారులు ఉన్నారు .ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES