- Advertisement -
నవతెలంగాణ – నాగర్జున సాగర్
నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీలో పాలకపాటి కనకరాజు(50) తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సాగర్ ఎస్ ఐ ముత్తయ్య తెలిపిన వివరాలు ప్రకారం.. మృతునికి ఇద్దరు చెల్లెలు ఉండగా.. వారికి వివాహం అయింది. సోదరుడు మరణించడంతో ఒంటరిగా స్థానికంగా పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. మద్యానికి, దురాలవాట్లకు బానిసై ఒంటరిగా జీవిస్తూ నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. సాగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -