- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూర్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన రాజు (35) కిరాణా షాప్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా కిరాణా షాప్ నడవక చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
- Advertisement -