Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాన్ దొడ్డి సర్పంచ్ ఏకగ్రీవం

మాన్ దొడ్డి సర్పంచ్ ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి
రాజోలి మండలంలోని మాన్ దొడ్డి గ్రామపంచాయతీ సర్పంచ్ సీటు ఏకగ్రీవమైంది. ఈ సర్పంచ్ పదవిని అభ్యర్థి రూ. 40 లక్షల 80 వేలంలో దక్కించుకున్నట్టు ఆ గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ ఏకగ్రీవం వెనక బిజెపి పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి ఉన్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సర్పంచును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చట్టరీత్యా నేరమని అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా బిజెపి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారులు స్పందించి మాన్ దొడ్డిలోనే కాకుండా మిగతా గ్రామాల్లో కూడా ఎలక్షన్లు యధావిధిగా జరిపి, సర్పంచులను ఎన్నుకోవాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -