- Advertisement -
ఆచూకీ కోసం గాలింపు చర్యలు..
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎల్ మడుగులో వ్యక్తి గల్లంతనైనా ఘటన సోమవారం చోటు చేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం.. మంథని మండలం ఖాన్ సాయి పేట గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలానికి చెందిన మోటార్ చెడిపోవడంతో బయటకు తీయడానికి ఇద్దరు వ్యక్తుల సహాయం కోరాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నీటిలో జారీ గల్లంతైనట్లు సమాచారం.ఎల్ మడుగులో మొసళ్లు సంచరిస్తుంటాయి. దీంతో మోసళ్ళు తీసుకెళ్లి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తి ఆచూకీ కోసం పోలీస్, ఫైర్ తో పాటు సంబంధిత అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -