- Advertisement -
సర్పంచ్ బండి స్వామితోపాటు పలువురు సత్కారం..
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో శనివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పర్యటించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్ కుమారుల దొతిల వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మందకృష్ణ హాజరైయ్యారు. ఈ క్రమంలో మందకృష్ణ మాధిగను గ్రామ సర్పంచ్ బండి స్వామి, బిసి సంఘం యూత్ నాయకులు బొబ్బిలి నరేశ్ గౌడ్, కోట మహేష్, కాంగ్రెస్ నాయకుడు తాండ్ర మల్లేష్ లు మర్యాపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు.
- Advertisement -



