- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ళ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓట్లు వేయాలని ప్రచార నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు తత్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జక్కుల చిన్న జంగయ్య యాదవ్, మట్ట వెంకటయ్య గౌడ్, నారాయణ నాయక్, అలీ భాయ్, సంతు యాదవ్, భరత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



