- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని రెడ్డి పేటతో పాటు ఆయా గ్రామాల్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దేశం కోసం తన , గిరిజనుల హక్కుల కోసం”మా దేశం మా స్వేచ్ఛ”అనే నినాదంతో పోరాటం చేసి ప్రాణాలర్పించిన గొప్ప పోరాటయోధుడని కొనియాడారు. ఆయన పోరాటం భవిష్యత్తరాలకు మార్గదర్శకమని అన్నారు. కార్యక్రమంలో నాయిని నర్సింలు, చెట్టుపల్లి శేఖర్, కోలకాని ప్రసాద్, జిల్లా బాలయ్య, దూలం రెడ్డి, బోడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -