Sunday, June 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమావోయిస్టు తోపాటు గ్రామస్థుడి హత్య

మావోయిస్టు తోపాటు గ్రామస్థుడి హత్య

- Advertisement -

నవతెలంగా – హైదరాబాద్ : లొంగిపోయిన మావోయిస్టుతో పాటు మరొక గ్రామస్థుడిని నక్సలైట్లు హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సెండ్రబోర్‌, యమపూర్‌ గ్రామాలకు చెందిన సమ్మయ్య, వేకో దేవాలను శనివారం రాత్రి సాయుధంగా వచ్చిన మావోయిస్టులు అపహరించారు. వారిద్దరిని పోలీస్‌ ఇన్‌ ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు ప్రజా కోర్టు నిర్వహించి దారుణంగా హత్య చేశారు.కాగా, సమ్మయ్య మాజీ మావోయిస్టు పార్టీ సభ్యుడు. ఇతను ఇటీవలే జన జీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చి బీజాపూర్‌ పోలీస్‌ అధికారుల ఎదుట లొంగిపోయాడు. సమ్మయ్య, దేవాలు మావోయిస్టు పార్టీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారనే కారణంతో నక్సలైట్లు వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పామేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గడిచిన వారం రోజుల్లో మావోయిస్టులు ఇప్పటివరకు ఐదుగురిని హత్య చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -