విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు.విజరు ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మించగా, సర్వాంత్ రామ్ క్రియే షన్స్ పై జె.రామాంజనేయులు సమర్పించారు. ఈ సినిమాను నేడు (శుక్రవారం) సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’విజయ్ ఆంటోనిని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాను. ఆయనకు సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. నేను అలాంటి వారు తీసే చిత్రాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటాను. అందుకే నేను ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఆయన ప్రొడక్షన్ కంపెనీ, వ్యాల్యూస్, మేకింగ్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం’ అని అన్నారు.
‘మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ బాబుకి ధన్యవాదాలు. ఆయన చాలా గొప్ప నిర్మాత. ఆయన మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా మొదటి సక్సెస్. లియో జాన్ పాల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు. ఇందులో చాలా లేయర్లు ఉంటాయి. నేను అందించిన సంగీతం మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది’ అని హీరో విజరు ఆంటోనీ చెప్పారు.
భిన్న కాన్సెప్ట్తో ‘మార్గన్’
- Advertisement -
- Advertisement -